
చర్ల మండలంలో ఆదివాసీ జేఏసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆదివారం విశ్వ కోయ-గోండి భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోయ-గోండి భాషలు ఆదివాసీల సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవానికి ప్రతీకలని, భావితరాలకు ఈ భాషను అందించేందుకు ప్రతి కుటుంబం కృషి చేయాలని పిలుపునిచ్చారు.


















