
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి ఎస్టీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే అనర్థాలు, బానిసత్వం నుంచి బయటపడే మార్గాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హోమియో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యo వహించారు.



















