
భద్రాచలం నియోజకవర్గంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న 28 ఏళ్ల యువకుడికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే, జనరల్ సర్జన్ డాక్టర్ తెల్లం వెంకటరావు స్వయంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం కావడంతో యువకుడికి పునర్జన్మనిచ్చినట్లయింది.



















