అమలాపురం, 6 July
అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన పద్నాలుగు మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.4 లక్షలు జరిమానాగా విధించారు.
అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన పద్నాలుగు మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించినట్లు పట్టణ సి.ఐ.పి వీరబాబు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని సోమవారం మేజిస్ట్రేట్ చామకూరి నాగేశ్వరావు ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం ఒక లక్ష నలభై వేల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసినట్లు తెలిపారు.
వీరబాబు మాట్లాడుతూ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు.











