
ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. పుస్తకాలు, యూనిఫాం, రవాణా వంటి అదనపు ఖర్చుల పేరుతో భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నోటీస్ బోర్డుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించాలన్న నిబంధనను కూడా పాటించడం లేదు.

సమాజంలోని సమస్యలపై పత్రికలు నిర్భయంగా పని చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ రావు అన్నారు. నూతనంగా ప్రారంభమైన 'ఉదయనేత్రం' దినపత్రికను ఆయనకు అందించిన సందర్భంగా ఎమ్మెల్సీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా నిలవాలని సూచించారు.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక కోటా కేటాయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గిరిజన ఎమ్మెల్యేలు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. అనేక గిరిజన కుటుంబాలు ఇంకా గుడిసెల్లోనే నివసిస్తున్నాయని వారు తెలిపారు.

మణుగూరులో ట్రాక్టర్ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో, వారి వేతనాల పెంపుపై యజమానులతో ఒప్పందం కుదిరింది. జూలై 1న TUCI ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో, రోజువారీ వేతనాన్ని రూ.500 నుండి రూ.600కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం 2026-2028 వరకు అమలులో ఉంటుంది.

భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి బుధవారం ఓ మహిళ నదిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించి, నదిలోకి దూకి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో పెను ప్రమాదం తప్పింది.

చర్ల మండలంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు దుక్కి దున్నడం, భూములను సాగుకు సిద్ధం చేయడం, వరి నారు పోయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అనుకూల వాతావరణంతో పొలాలు సందడిగా మారాయి.

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో వైద్యులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలోని డాక్టర్లను శాలువాలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ప్రాణాలు కాపాడే వైద్యులను దైవంతో సమానంగా భావిస్తారని ఆయన కొనియాడారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ SHO శ్రీ షేక్ షాబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ASN మహిళా కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, వేధింపులపై మహిళలకు సూచనలు అందించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శివకోడు నేషనల్ హైవేపై ఖాళీ బ్రాందీ, బీరు సీసాలు పెద్ద ఎత్తున రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సీసాలపై నుంచి వాహనాలు వెళ్లడంతో అవి పగిలి, రహదారి అంతా గాజు పెంకులతో నిండిపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలను కాపాడే ప్రతి వైద్యుడు నడిచే దైవమని, సమాజానికి వారి సేవలు అమూల్యమని ఆయన అన్నారు. రోగికి ధైర్యాన్ని, కుటుంబానికి భరోసాను అందించే బాధ్యతను వైద్యులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.

వెంకటాపురం మండలం, సుదిబాక గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మడప భాస్కర్ విద్యుత్ షాక్తో శరీరంలో 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. హైదరాబాద్లో చికిత్సకు రూ.20-30 లక్షలు ఖర్చయినా, ఆర్థిక స్తోమత లేక కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు చొరవతో యువకుడికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

చర్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో ట్రైనింగ్ కలెక్టర్ ఎం. మురళి, ఎంపీడీవో ఈదయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సూర్యనారాయణమూర్తిలను చర్ల మండల సర్పంచులు ఘనంగా సన్మానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మస్కట్లో ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఎన్. రామేశ్వరం గ్రామానికి చెందిన సి.హెచ్. ధనలక్ష్మిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి తరలించారు. కుటుంబ పోషణ కోసం మస్కట్ వెళ్లిన ధనలక్ష్మి, అక్కడ అధిక పని గంటలు, ఒత్తిడి, అనారోగ్యంతో బాధపడింది.

గిరిజనుల భూముల సమస్యపై స్పష్టత వచ్చే వరకు పోరాటాలు ఆగవని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పేర్కొన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలున్న భూముల్లోనే సాగును అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

చర్ల మండలంలోని మారుమూల జీపీఎస్ పాఠశాలలను మంగళవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన స్థాయిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఉద్దీపకం వర్క్బుక్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల హాజరు శాతం పెంచేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

కాకినాడ జిల్లాలో ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అరెస్టులు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచన మేరకు శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ వైరా ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం గుట్టబడిగా ఉన్న ఈ కార్యాలయాన్ని రీమోడలింగ్ చేసి, పాఠశాల నడిచేలా సుందరీకరించాలని యోచిస్తున్నారు.

జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సాంస్కృతిక రక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో భద్రాచలంలో ఆదివారం (06/07/26) జాతీయ ఆదివాసీ సెమినార్ జరిగింది. 'మా ఊళ్లో—మా రాజ్యం' సాధన కోసం దేశవ్యాప్తంగా మరో పోరాటం చేపట్టాలని సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు చందా లింగయ్య దొర పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో 5వ షెడ్యూల్డ్ ప్రాంత పరిరక్షణ, ఆదివాసీల అభివృద్ధి, స్వయం పాలనతో పాటు 10 కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.

ప్రభుత్వ రంగంలో సుమారు 39 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న నలుగురు జిల్లా స్థాయి అధికారులు, తహసిల్దార్లను మంగళవారం కలెక్టరేట్ వేదికగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కలెక్టర్ కొనియాడారు.